డెలివరీలో వైద్యుల నిర్లక్ష్యం .. ఘోషా ఆస్పత్రిలో దారుణంగా శిశువు మృతి
పండంటి బిడ్డ పుడతాడని గంపెడాశతో ఆసుపత్రికి వెళ్లిన ఓ తల్లి వైద్యులు చేసిన నిర్వాకానికి గుండెలవిసేలా రోదిస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి తన బిడ్డను కళ్లారా చూసుకుందాం అనుకున్న ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డ పరిస్థితి చూసి కన్నీరు మున్నీరు అవుతోంది. తనబిద్దను ఎత్తుకోవాలని ఆశపడిన ఆ తండ్రి బిడ్డ మరణంతో ఆవేదన చెందుతున్నాడు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల పగిలి మెదడు బయటకు వచ్చి మృతి చెందిన శిశువును చూసి అక్కడి వారంతా ఆవేదనకు గురయ్యారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే విశాఖలోని విక్టోరియా ఘోషా ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది . వైద్యులు నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో ఓ శిశువు తల పగిలి మెదడు బయటకు వచ్చి మృతి చెందింది. దీంతో శిశువు మృతదేహంతో ఆస్పత్రి ముందు శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలోనూ ఘోషా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన లు చోటుచేసుకున్నాయి. కానీ సంబంధిత డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉదంతంపై సైతం ఆసుపత్రి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి . తమకేమీ సంబంధం లేదు అన్నట్టు వైద్యులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మృతి చెందిన శిశువు తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications