అబద్దాలు చెప్తారా? ఏపీ అధికారులపై కేంద్ర మంత్రి సీరియస్!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు లో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఏ.కొండూరులో పర్యటించిన కేంద్ర మంత్రి తాగునీటి సరఫరా గురించి లంబాడి తండా వాసులతో మాట్లాదారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి ఎదుట తండావాసులు తమకు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయని వాపోయారు. ఇక తండావాసులు చెప్పిన సమస్యపై జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారిని వివరణ కోరారు. దాంతో జిల్లా గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారి తాగునీటికి ఇబ్బంది లేదని చెప్పారు.వెంటనే జిల్లా అధికారుల పై సీరియస్ అయిన కేంద్ర మంత్రి ప్రతిరోజు తాగునీటికి ఇబ్బంది లేకపోతే, తండా వాసులు అందరూ అబద్ధం చెప్పారా అంటూ ప్రశ్నించారు.

ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి తప్ప, ఇలా అసత్యాలు మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. నీరు వస్తుంటే ఇక్కడి వారు రావడం లేదని చెబుతారా అని అధికారులను నిలదీశారు. కేంద్ర మంత్రి తీవ్ర స్వరంతో సీరియస్ కావడంతో అధికారులు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం సెంటర్ ను ఆమె పరిశీలించారు. పేషంట్ ల తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఏ కొండూరు లో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రశ్నించారు. స్థానిక పి.హెచ్.సి ని పరిశీలించి, ఆసుపత్రి సిబ్బందిని అడిగి పనితీరు వివరాలు తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న లబ్ధి పొందాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సూచించారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి మొత్తం పర్యటనలో జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications