ముగ్గురు సిబ్బందితో డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ మిస్సింగ్
బెంగళూరు: చెన్నై నుంచి సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో బయలుదేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అదృశ్యమైంది. సోమవారం రాత్రి నుంచి దాని జాడ కనిపించడం లేదు. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ తప్పిపోయిన విషయాన్ని ఐసిజి అధికారులు మంగళవారం ఉదయం ధ్రువీకరించారు.
సోమవారం రాత్రి 9 గంటల 23 నిమిషాల సమయంలో రాడార్ నుంచి సంబంధాలు ఆ ఎయిర్క్రాఫ్ట్కు తెగిపోయాయి. దాన్ని జాడ కోసం కోస్ట్ గార్డులు, నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడు తీరంలో, పాల్క్ బే వద్ద నిఘా కోసం ఎయిర్ క్రాఫ్ట్ సోమవారం సాయంత్రం చెన్నై కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి బయలుదేరింది.

ఆ విమానం ఇటీవలే 2014 ఐసిజి బ్యాచులో చేరినట్లు తెలుస్తోంది. అనుభవం గల సిబ్బంది దానిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదు ఐసిజి ఓడలు, నాలుగు భారత నావికాదళం అసెట్స్ రంగంలోకి దిగాయి. సముద్రంపై ఎప్పటి మాదిరిగానే నిఘాకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరిందని ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డికె శర్మ చెప్పారు.
-
నో దోసె, నో పూరీ: బెంగళూరు పీజీల్లో రెండు పూటల మాత్రమే భోజనం -
US Refueling Aircraft Crash: ఇరాన్ వార్ లో అమెరికాకు అతిపెద్ద షాక్..! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications