జూబ్లీహిల్స్లో డ్రగ్స్ రాకెట్ రట్టు: సినీ నిర్మాత, నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. ఇందులో ఇద్దరు నైజీరియన్లు, ఓ నిర్మాత అరెస్టు అయ్యాడు. పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని సమాచారం.
మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సినీ నిర్మాత పేరు సుశాంక్ రెడ్డి అని తెలుస్తోంది. వారి వద్ద నుండి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హిందూపురంలో ఐటీ దాడులు
అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం ఐటీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 15చోట్ల దాడులు నిర్వహించి రూ.10 కోట్ల నల్లధనాన్ని గుర్తించారని సమాచారం.
350 కిలోల గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డిప వద్ద 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వ్యానును స్వాధీనం చేసుకున్నారు.