సాయిరెడ్డికే తిరిగి రాజ్యసభ- ఢిల్లీలో కీలక పరిణామాలు...!?
ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. వైసీపీ ఎంపీగా సాయిరెడ్డి రాజీనామా తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో ఈ స్థానం కూటమి కే దక్కనుంది. సాయిరెడ్డి రాజీనామా వెంటనే ఈ స్థానం పైన ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చారు. ఏపీలో కూటమిలోనే కొనసాగుతూనే బీజేపీ పట్టు పెంచుకుంటోంది. సాయిరెడ్డి విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక వేళ బీజేపీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.
ఈసీ షెడ్యూల్
ఏపీ నుంచి కూటమి మరో రాజ్యసభ స్థానం దక్కించుకోనుంది. వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ కానుంది. 29వ తేదీ వరకు నామినేషన్లకు చివరి గడువు. వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఏకగ్రీవంగానే ఎన్డీఏ సీటు గెలుచుకోనుంది. కాగా, కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్ధి ఎవరు. రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టువిడుపులతో ఉంటామని.. పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు.

సాయిరెడ్డి స్థానంలో
బీజేపీ ఖాతాలో ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది. అయితే, ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్ర బాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమి లో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సీమ ప్రాంతానికే బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా.. తెలంగాణ లో ఆయన సేవలు వినియోగించుకోనుంది.
బీజేపీ అభ్యర్దిగా
అదే విధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో బీజేపీ నుంచి ముగ్గురి పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నాయి. అందులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు తో పాటుగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో సాయిరెడ్డి సైతం బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. సాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుండటంతో ఆయన చేరిక ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. లిక్కర్ కేసులో సాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, ఈ సారికి సాయిరెడ్డి ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీటు బీజేపీకే ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఏపీ నేతలకే అవకాశం ఇస్తారా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా అనూహ్యంగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications