ఏపీలో అధికారం దక్కేదెవరికి, పబ్లిక్ పల్స్ క్లియర్ - తేల్చేసిన ప్రముఖ సర్వే సంస్థ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సస్ టీడీపీ,జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయట పెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు.
మారుతున్న సమీకరణాలు: ప్రముఖ సెఫాలజిస్ట్..ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయట పెట్టారు. పార్ధదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46 శాతం ప్రజల మద్దతు ఉంది. అదే విధంగా టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు.

ఇతరులకు ఒక శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం మద్దతు ఉండగా.. టీడీపీకి 43 శాతం మద్దతు ఉన్నట్లు తేల్చారు. జనసేనకు 8 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు 1 శాతం మాత్రమే మద్దతు లభిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజల మద్దతు ఎవరికి: ఇక..ముఖ్యమంత్రిగా ప్రజా మద్దతు పైనా ప్రజానాడి ఏంటనేది బయట పెట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా 46 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా..చంద్రబాబు సీఎం కావాలని 36 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. లోకేష్ సీఎంగా 8 శాతం ప్రజలు..పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా 10 శాతం మంది కోరుకుంటున్నారని విశ్లేషించారు. ప్రధానిగా ఏపీలో మోదీకి 42 శాతం మంది ప్రజల మద్దతు ఉండగా..రాహుల్ గాంధీకి 39 ప్రజల మద్దతు ఉందని తేల్చారు.
ఇక..19 శాతం ప్రజలు ఎవరినీ తమ ప్రాధాన్యతగా తేల్చుకోలేదు. ఏపీలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన ప్రజాభిప్రాయం మేరకు ఈ ఫలితాలు వెల్లడించినట్లు స్పష్టం చేసారు. రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజవకర్గాల్లో శాంపిల్స్ సేకరించినట్లు స్పష్టం చేసారు.
We will publish a weekly tracker for next #AndhraPradesh Election 2024. This is our 1st weekly tracker. Samples taken from 4 Assembly segments.
— Partha Das (@partha2019LS) December 11, 2023
Vote% in Assembly Election :
YSRCP - 46%
TDP - 40%
Janasena - 11%
TDP/Janasena - 2%
Others -1%
Vote% in Parliament Election :
YSRCP -…
అధికారం దక్కేదెవరికి: గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పార్ధదాస్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలు వెల్లడించారు. అయితే, ఈ నివేదికలో టీడీపీ - జనసేన వేర్వేరుగా ప్రస్తావన చేసారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు ఖరారు చేసుకొని కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా..ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే జగన్ కు 10 శాతం మంది ప్రజల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రతీ వారం ఇదే విధంగా అంచనాలను వెల్లడిస్తామని స్పష్టం చేసారు. గెలుపు పైన మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా..మేనిఫెస్టో..సంక్షేమ పథకాలు..సామాజిక సమీకరణాలు ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో..ఈ అంచనాల పైన రాజకీయంగా చర్చ మొదలైంది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications