విలీనానికి సిద్ధమని చెప్పాం కదా: పటేల్పై ఈటెల ఫైర్

సిఆర్ ఇంటి ముట్టడి
సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి రామచంద్రయ్య ఇంటిని ఎపిఎన్జీవోలు గురువారం ముట్టడించారు. రాజీనామా చేయకుంటే ఆయనను అడుగడుగునా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులు అందరు రాజీనామా చేయాల్సిందే అన్నారు.
కాగా, ముమ్మాటికి హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే ఈ విషయంలో ఎలాంటి వివాదానికి తావులేదని సీమాంధ్ర మాదిగ లాయర్స్ ఫెడరేషన్ (ఎంఎల్ఎఫ్) ప్రతినిధులు ఎకె విశ్వనాథ్, ప్రసాదరావు, దయానంద్ బుధవారం చెప్పారు. సిడబ్ల్యూసి తీర్మానాన్ని వెంటనే అమలుపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆరుగురితో కూడిన ఎంఎల్ఎఫ్ ప్రతినిధుల బృందం బుధవారం వరంగల్కు వచ్చింది.
హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న నూతన బార్ అసోసియేషన్ హాలులో జిల్లా అడ్వకేట్లతో ఈ ప్రతినిధుల బృందం సమావేశం అయింది. అనంతరం బృందం సభ్యులు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర పెట్టుబడిదారులే విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు సీమాంధ్ర రాష్ట్రానికి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. విభజన వల్ల ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాల ఆధిపత్యం పెరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications