వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వెంకయ్య జోకర్‌కి ఎక్కువ, బపూన్‌కి తక్కువ'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు జోకర్‌కి ఎక్కువ, బఫూన్‌కి తక్కువంటూ అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర పోషించాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎవరైనా బద్ద శత్రువు ఉన్నారంటే అది సీఎం చంద్రబాబేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

Ex MP Harsha kumar takes on venkaiah naidu and chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప జేయాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక ఇటీవల జరిగిన నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను నిబెట్టి మరోసారి తప్పు చేసిందన్నారు.

English summary
Ex MP Harsha kumar takes on central minister venkaiah naidu and andhra pradesh cm chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X