స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ నేత: రేపే నామినేషన్: ఎన్టీఆర్, వైఎస్సార్ ఫొటోలతో..!!
Muddaraboina Venkateswara Rao: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీని నిర్వహించనున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. దీనితో ఆయన టీడీపీకి గుడ్బై చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ మొదట్లో ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు.

ఈ ఎన్నికల్లో నూజివీడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారాయన. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఇందులో ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ఆయన వినియోగించుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీసీలు వెన్నెముకగా చెప్పే తెలుగుదేశం పార్టీ అధినాయకులు కష్టపడి పనిచేసిన అదే సామాజిక వర్గ నాయకులకు వెన్నుపోటు పొడుస్తోన్నారని ఆరోపించారు. పది సంవత్సరాలుగా కష్టపడి పార్టీని బలోపేతం చేసిన తనకు టికెట్ ను నిరాకరించడమే దీనికి నిదర్శనమని అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ అవాస్తవాలేనని విమర్శించారు. కోట్లు గుమ్మరించిన బడా బాబులకు టికెట్లు ఇస్తోన్నాడని ధ్వజమెత్తారు. నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులను చందరబాబు వంచిస్తోన్నాడని ఆరోపించారు.
నూజివీడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను నామినేషన్ వేయదలచుకున్నానని ముద్దరబోయిన తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటు తన అభిమానులు, కార్యకర్తలను టీడీపీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను గానీ తన అభిమానులు గానీ భయపడబోరని స్పష్టం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications