అటెండర్ ఫొటో తీస్తే లీకేజీ అంటారా?: గంటా ఫైర్, చంద్రబాబు వార్నింగ్
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష జరగడానికి ముందే జరిగితే దాన్ని లీకేజీ అంటారని అన్నారు.
అమరావతి: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష జరగడానికి ముందే జరిగితే దాన్ని లీకేజీ అంటారని అన్నారు.
మంత్రి గంటా లీకేజీ అంశంపై ఢిల్లీలో మాట్లాడుతూ.. ఓ అటెండర్.. పరీక్షలు జరుగుతుండగా ఫొటోలు తీసి షేర్ చేశాడని తెలిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఏపీని విద్యకు మోడల్ స్టేట్గా తీర్చుదిద్దుతున్నామని చెప్పారు.
లీకేజీ, ఆత్మహత్యల్లో 'నారాయణే' నెం.1, గంటా ఏం చేస్తున్నారు: రోజా నిప్పులు
ఉపేక్షించొద్దు: చంద్రబాబు వార్నింగ్
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ నేతలు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. నేరానికి పాల్పడినవారు ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని ఆదేశించారు.
సభలో వైసీపీ ఆందోళన: జగన్ పార్టీది అరాచకమంటూ గోరంట్ల ఆగ్రహం
ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, లీకేజీపై చర్చించాలంటూ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన కొనసాగిస్తుండటంతో వాయిదాలు పడుతూ సాగుతోంది సభ.