వివాహేతర సంబంధం: డ్రైవర్తో కలిసి కొడుకు హత్య
మూడు రోజుల క్రితం తొండవాడ ప్రాంతంలోని బైపాస్ రోడ్డుకు సమీపంలో పొదళ్లో తొమ్మిదేళ్ల బాలుడ్ని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ ఘటన గత శనివారం వెలుగులోకి వచ్చింది. 80శాతం బాలుడి శరీరం కాలిపోవడంతో అతడు గుర్తుపట్టలేకుండా మారాడు.
అతని మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ఆధారంగా అతడు అంతకుముందు రోజు అదృశ్యమైన టిటిడి ఛైర్మన్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న మునిరత్నం కుమారుడు మురళిగా గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. బాలుడ్ని గుర్తుపట్టకుండా చేసేందుకే అతని ముఖంపై పెట్రోల్ పోసి నిందితులు కాల్చివేసినట్లు తెలుస్తోంది.
కాగా, మునిరత్నం, అతని భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ (12), మురళి (9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో ఆడుకుంటానని చెప్పి వెళ్లిన మురళి.. రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో మునిరత్నం పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి మృతదేహాన్ని శనివారం గుర్తించిన పోలీసులు, మూడు రోజులపాటు విచారణ జరిపి హత్య మిస్టరీని ఛేదించారు.