చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: డ్రైవర్‌తో కలిసి కొడుకు హత్య

|
Google Oneindia TeluguNews

extramarital affair: Mother killed his son with a driver
చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన బాలుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలుడి తల్లి, డ్రైవరే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మూడు రోజుల క్రితం తొండవాడ ప్రాంతంలోని బైపాస్ రోడ్డుకు సమీపంలో పొదళ్లో తొమ్మిదేళ్ల బాలుడ్ని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ ఘటన గత శనివారం వెలుగులోకి వచ్చింది. 80శాతం బాలుడి శరీరం కాలిపోవడంతో అతడు గుర్తుపట్టలేకుండా మారాడు.

అతని మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ఆధారంగా అతడు అంతకుముందు రోజు అదృశ్యమైన టిటిడి ఛైర్మన్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మునిరత్నం కుమారుడు మురళిగా గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. బాలుడ్ని గుర్తుపట్టకుండా చేసేందుకే అతని ముఖంపై పెట్రోల్ పోసి నిందితులు కాల్చివేసినట్లు తెలుస్తోంది.

కాగా, మునిరత్నం, అతని భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ (12), మురళి (9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో ఆడుకుంటానని చెప్పి వెళ్లిన మురళి.. రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో మునిరత్నం పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి మృతదేహాన్ని శనివారం గుర్తించిన పోలీసులు, మూడు రోజులపాటు విచారణ జరిపి హత్య మిస్టరీని ఛేదించారు.

English summary
A Woman killed his son with a driver for extramarital affair in Chandragiri mandal in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X