కానిస్టేబుల్ ఆయుబ్ను భార్య, పిల్లలే బ్యాట్తో కొట్టి చంపారు
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్య కేసు ఇటీవల విజయవాడలో కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీ వీడింది. పోలీసులు నిజానిజాలను రాబట్టారు.
విజయవాడ: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్య కేసు ఇటీవల విజయవాడలో కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీ వీడింది. పోలీసులు నిజానిజాలను రాబట్టారు.
ఆయూబ్ను అతని భార్య జకీరున్నీసా, కుమార్తెలు నీలోఫర్, నాజియా, కుమారుల సద్దాం, ఇమ్రాన్లే దారుణంగా హత్య చేశారని డీసీపీ పాలరాజు మీడియాకు తెలిపారు. వారు బ్యాట్తో కొట్టి చంపారన్నారు.
ఆయనను హత్య చేసిన అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి జక్కంపూడి వద్ద పడేశారని తెలిపారు. అనంతరం ఆ కారుని వదిలేసి రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.
ఈ కేసులో నిందితులని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయూబ్ను కుటుంబ సభ్యులే ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. మృతుడి సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాఫ్తు చేశారు.