వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసి,అత్యాచారం
విజయవాడ: కన్నతల్లిలా చూడవలసిన వదిన పైననే ఓ మరిది అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నిందితుడికి అతని తల్లి కూడా సహకరించిందని తెలుస్తోంది.
మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బాధిత మహిళ భర్త, అత్త, మరిదిలతో కలిసి ఉంటోంది. మరిది శ్రవణ్ వదిన స్నానం చేస్తుండగా గత నెల 27వ తేదీన వీడియో తీశాడు. దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
అతని చర్యకు ఆయన తల్లి కూడా మద్దతు పలికింది. ఆమెకు మరిది మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపాడు. స్నానం చేస్తుండగా తీసిన వీడియోను చూపించి బెదిరించాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బైక్ లారీ ఢీ, యువకుడి మృతి
కృష్ణా జిల్లాలోని గంగూరు వద్ద శుక్రవారం ఉదయం ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఓ యువతి గాయపడింది.
రెండు బైకులు ఢీ, ఇద్దరు మృతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్న అన్నలూరు సమీపంలో రోడ్డుపై ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు. అతి వేగం వల్లనే వారు మృతి చెందారని తెలుస్తోంది.