అక్కినినే కన్నుమూత: గుండెపోటుతో అభిమాని మృతి
మెదక్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు మృతిని తట్టుకోలేని ఓ వీరాభిమాని గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. మెదక్ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మయూరీ నగర్లో నివాసం ఉంటున్న కె.రాంబాబు (55) అనే అక్కినేని వీరాభిమాని గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందాడన్న విషయాన్ని టీవీలో చూస్తూ ఉదయం 11 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు రాంబాబును స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన మామ అక్కినేనికి వీరాభిమాని అని, అక్కినేని మరణవార్త టీవీల్లో చూసి తట్టుకోలేక మరణించారని రాంబాబు అల్లుడు భాస్కర్ మీడియాతో చెప్పారు.
అక్కినేని నాగేశ్వర రావును ఓ తరం యువత విపరీతంగా అభిమానించారు. దసరా బుల్లోడు, పూలరంగడు వంటి సినిమాలు అప్పట్లో అప్పటి యువతను ఉర్రూతలూగించాయి. గుండెపోటుతో మరణించిన రాంబాబు కూడా ఆ తరానికి చెందినవారే.
-
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!













Click it and Unblock the Notifications