వైసీపీలోకి మాజీ మంత్రి రామచంద్రయ్య, జగన్ సమక్షంలో 13న పార్టీలో చేరనున్న సీనియర్ నేత
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఈనెల 13న ముహూర్తం ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రామచంద్రయ్య కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీలోని ప్రధాన నాయకులంతా హస్తానికి గుడ్బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన రామచంద్రయ్య ఈ నెల 13న బొబ్బిలిలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కూడా కాంగ్రెస్ టీడీపీ పొత్తును నిరసిస్తూ పార్టీని వీడిన విషయం తెలిసిందే.
ఇక విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. గాయం నుంచి కోలుకున్న జగన్ సోమవారం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేపు హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి వెళతారు. విజయనగరంలో జగన్ బస చేస్తారు. సోమవారం రోజున పాయకపాడు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు జగన్.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై చాలామంది కాంగ్రెస్, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే చాలామంది వారి వారి పార్టీలను వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మరికొదరు నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications