మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా- నిజమేనంటూ వీడియో రిలీజ్-భయపడొద్దంటూ భరోసా...
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు తాజాగా కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన మాణిక్యాలరావు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావుకు కరోనా సోకిందన్న విషయం తెలిసి ఆందోళన చెందుతున్న అభిమానులకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇటీవలే తన మిత్రుడు, తాడేపల్లి గూడెం మన్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కు కరోనా వచ్చిందని, విషయం తెలియక తాను ఆయనతో పాటు కారులో ప్రయాణించడం వల్ల కరోనా సోకి ఉండొచ్చని మాణిక్యాలరావు తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కారులో ప్రయాణించిన తర్వాత కరోనా పరీక్ష చేయించుకుంటే ఈ విషయం బయటపడిందన్నారు.

Recommended Video
అయితే కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రజల్లో కరోనా కారణంగా ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే అయినా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చికిత్స తీసుకుని భయాందోళలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన సందేశంలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా#Bjp #coronavirus #Manikyalarao pic.twitter.com/yPeRC6VJQe
— oneindiatelugu (@oneindiatelugu) July 4, 2020
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications