టీడీపీ-జనసేనకు కొణతాల కీలక సలహా-టికెట్లకు ముందే ఆ ప్రకటన..!
ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి టికెట్ల ప్రకటనతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో దిశగా కసరత్తు జరుపుతోంది. అయితే ఓ కీలక అంశంపై మాత్రం ఇరు పార్టీల మధ్య ఎక్కడా చర్చ జరగడం లేదు. దీంతో త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోబోతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇరు పార్టీలకు ఓ కీలక సూచన చేశారు. టికెట్ల ప్రకటనకు ముందే ఈ కీలక అంశంపై ప్రకటన చేయాలని ఆయన సూచించారు.
టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటివరకూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలో సీట్ల ప్రకటన చేసేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు. అయితే ఇరు పార్టీల పొత్తు సజావుగా సాగేందుకు వీలుగా టీడీపీ, జనసేన ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందించుకుని ఓ ప్రకటన చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సలహా ఇచ్చారు. దీన్ని ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే సీట్ల ప్రకటన ఉండాలని ఆయన సూచించారు.

అలాగే క్షేత్రస్ధాయిలో ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కొణతాల రామకృష్ణ మరో సలహా కూడా ఇచ్చారు. నియోజకవర్గాల స్ధాయిలో టీడీపీ జనసేన మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సూచించారు. ఇందులో ఇరు పార్టీల నేతలు ఉండాలన్నారు. అలాగే అన్ని స్ధాయిలో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తద్వారా ఇరు పార్టీల మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలని కొణతాల రామకృష్ణ తెలిపారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications