ఐటీ ఫ్రెషర్స్ కు అండగా విజయసాయిరెడ్డి..! ప్రభుత్వ జోక్యం కోరుతూ..!
ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్ట్రైల్లో వ్యవసాయం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆయన పలు రంగాలకు సంబంధించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అదే సమయంలో సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో ట్వీట్ చేశారు.
ఇందులో ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి తొలిసారి సాయిరెడ్డి గళం విప్పారు. ముఖ్యంగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టే ఫ్రెషర్స్ కు తక్కువ జీతాలు ఇస్తున్న కంపెనీల వైఖరిపై సాయిరెడ్డి నిశిత విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరికి తగిన జీతాలు ఇప్పించాలని తాజాగా ఎక్స్ లో మాజీ ఎంపీ ఓ ట్వీట్ చేశారు.

భారతదేశ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ జీతాల స్తబ్దత చాలా అన్యాయమని విజయసాయిరెడ్డి తెలిపారు. 2010 నుండి ఐటీ సంస్థలకు జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ మరియు రికార్డు లాభాలు ఉన్నప్పటికీ, సగటు ప్రారంభ జీతం సంవత్సరానికి రూ.3.5 లక్షల వద్దే నిలిచిపోయిందని సాయిరెడ్డి తెలిపారు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలను నిర్ణయించేలా ప్రభుత్వం ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలని సాయిరెడ్డి కోరారు.
The stagnation of entry-level salaries in India’s IT sector is deeply unfair. Since 2010, the median starting salary has remained stuck at ₹3.5 lakh/annum despite soaring living costs and record profits for IT firms. The govt. should nudge the IT companies to peg salaries to…
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2025
ప్రస్తుతం ఐటీ రంగంలోనూ ఏఐ రాకతో స్తబ్ధత ఏర్పడింది. ఉద్యోగాలు ఉంటాయో లేదో అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. ఇక ఫ్రెషర్స్ పరిస్ధితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు జంకుతున్నాయి. దీంతో ఉన్నత చదువులు పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేక యువత అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రెషర్స్ కు తక్కువ జీతాలు ఇస్తున్న ఐటీ కంపెనీలపై సాయిరెడ్డి ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications