జమిలి ముందుకొస్తోంది ? బాబు, రేవంత్..బీ అలర్ట్-మాజీ కేంద్రమంత్రి షాకింగ్..!
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఈసారి జమిలి ఎన్నికలు ఖాయమని ఎప్పుడో తేల్చేసింది. ఇప్పుడు వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న కేంద్రం.. జమిలి ఎన్నికల్ని ముందుకు జరుపుతోందా ? ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా ? అంటే అవునంటున్నారు ఏపీకి చెందిన మాజీ కేంద్రమంత్రి. ఈ మేరకు అలర్ట్ గా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు.
తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాజకీయం మారుతోందన్న అంశాన్ని ఆయన తెలుసుకున్నారు. అంతే కాదు దాన్ని బయటపెట్టారు కూడా. అంతా ఊహిస్తున్నట్లుగా 2028లోనే 2029లోనో కాదు 2027లోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చింతా మోహన్ ఇవాళ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ మేరకు జమిలి ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని చింతా మోహన్ సూచించారు. నిన్న తాను ఢిల్లీ వచ్చానని, కాసేపు అటూ, ఇటూ తిరిగానని, ఢిల్లీలో దాగివున్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని చింతా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పోలవరంలో ఓ ముఖ్యమంత్రి 6 వేల కోట్లు అక్రమంగా సంపాదించడని, ఆయన పేరు తాను చెప్పదల్చుకోలేదన్నారు.
గతంలో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నట్లు మోడీ చేసిన ఆరోపణలపై ప్రశ్నిస్తే..ఆయన చాలా భయస్తుడని, కాస్తో కూస్తో... భయం, నీతి ఉందన్నారు. ఆయన చాలా జాగ్రత్త పరుడన్నారు. పార్టీలు వేరైనా, తామిద్దరిదీ ఒకటే ప్రాంతం అన్నారు. చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసన్నారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు -
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!











Click it and Unblock the Notifications