అప్పులపై మాట మార్చేసిన చంద్రబాబు-లెక్కలు తెలియని ఆర్ధికమంత్రులు-బుగ్గన ఫైర్..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై సీఎం చంద్రబాబు మాట మార్చేశారని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గతంలో 14 లక్షల కోట్లని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు 9.56 లక్షల కోట్లని చెబుతున్నారని, అలాగే కార్పోరేషన్ల అప్పుల విషయంలోనూ తవ్వుతామంటూ బెదిరించడం ఎందుకు తవ్వితే తేలిపోతుందంటూ చంద్రబాబుకు బుగ్గన సవాల్ విసిరారు.
గతంలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి అప్పులు చేసిందంటూ చేస్తున్న విమర్శల్ని బుగ్గన ఖండించారు. అసలు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కు లెక్కలు అర్ధం కావా అని బుగ్గన ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) ద్వారా పథకాల సొమ్ము తాము పంచితే స్కాం అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు విద్యుత్ ట్రూఅప్ చార్జీల విషయంలోనూ ప్రభుత్వం విపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఐదేళ్లో 20 వేల కోట్లకు పైగా ట్రూఅప్ ఛార్జీలు విధించారని, కానీ తాము వైసీపీ హయాంలో ఐదేళ్లలో కేవలం 2300 కోట్లు మాత్రమే ట్రూఅప్ ఛార్జీలు విధించినట్లు బుగ్గన చెప్పుకొచ్చారు. తాజాగా ఐదు నెలల్లోనే 6770 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు విధించారంటూ ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ విమర్శల్ని ఆయన తప్పుబట్టారు.
-
Loans: ఈ లోన్స్ తీసుకుంటే సగం సర్కారే కడుతుంది! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications