జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్-4 స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ఛైర్మన్ల రాజీనామా-వెంటనే ఆమోదం
ఏపీలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు, వాటి ఛైర్మన్ల వ్యవహారం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేషన్ పోస్టుల భర్తీలో భాగంగా నాలుగు విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతికి స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. వీటికి వైసీపీ నేతల్ని ఛైర్మన్లుగా నియమించారు. అయితే వీరి విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారిని తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సమాచారం. దీంతో వారంతా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీటిని వెంటనే ప్రభుత్వం ఆమోదించింది.

గతంలో కేంద్ర ప్రభుత్వం కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత మరో రెండు సిటీల్ని స్మార్ట్ సిటీలుగా గుర్తిస్తూ వాటి కార్పోరేషన్లకు ఛైర్మన్లను సైతం ప్రకటించింది. అయితే వీటికి న్యాయపరంగా అభ్యంతరాలు ఉండటంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదనే ప్రభుత్వం వారితో రాజీనామాలు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సదరు కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవులు మాత్రం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.
-
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications