వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు - 10 రోజుల్లో తొమ్మిదోసారి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

సామాన్యులపైన పెట్రో ధరల భారం పెరుగతూనే ఉంది. గడిచిన 10 రోజుల వ్యవధిలో వరుసగా తొమ్మిదోసారి ధరలు పెరిగాయి. నిత్యం పెరుగుతూ పోతున్న పెట్రో ధరలతో నిత్యావసర ధరలు సైతం భగ్గుమంటున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్దం ప్రభావంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇదే విషయాన్ని అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయిన రోజునే ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక, యుద్దం తో పాటుగా అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత ఒక్క సారిగా సిలిండర్ ధర రూ 50 పెరిగింది.

అదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మరో సారి ఇంధన ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్​ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది.

Fuel prices were hiked again on Thursday, across metro cities for the 9th time in the last ten days

ఆంధ్రప్రదేశ్​లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్​లో లీటర్​ పెట్రోల్​ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్​లో పెరిగిన ధరల అనంతరం లీటర్​ పెట్రోల్​ రూ.115.42, డీజిల్​ రూ.101.58గా ఉంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటంతో పరోక్షంగా అన్నింటి పైనా ప్రభావం చూపుతోంది.

English summary
Fuel prices were hiked again on Thursday, across metro cities for the 9th time in the last ten days. Petrol rates were hiked by 80 paise a litre and diesel by 84 paise a litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X