జగన్ కోసమే: చిరు జట్టుపై గాలి, భయం: సోమిరెడ్డి

కేసులకు భయపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సిపిఎంతో పొత్తుకు దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తృతీయ కూటమి అధికారంలోకి రాదని తెలిసి సిపిఎంతో పొత్తుకు దూరమయ్యారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తృతీయ ఫ్రంట్ నుంచి ఎందుకు వైయస్సార్ కాంగ్రెసు తప్పుకుందో చెప్పాలని ఆయన జగన్ను డిమాండ్ చేశారు.
తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెసుకు లేదని ఆయన అ్నారు. శిక్షను తప్పించుకునేందుకే జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. అందుకే సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు పోస్టింగు ఇవ్వకుండా చాలా కాలం ఆపారని ఆయన అన్నారు.
సోనియా దయాదాక్షిణ్యాలతోనే జగన్కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. సిబిఐ కేసులు, జైలు రికార్డే వైయస్సార్ కాగ్రెసు పునాది అని విమర్శించారు. ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపే వైయస్సార్ కాంగ్రెసు నేతలకు నేతలకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు.
జగన్, కెసిఆర్ మాట విని కాంగ్రెస్ భూస్థాపితం అయిందన్నారు. తాము రైతు రుణ మాఫీ అంటే జగన్కు ఎందుకంత బాధ అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆపాలని కోర్టుల్లో జగన్ పిటిషన్లు వేశారని, జగన్కు ఓటమి భయమనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. విలువల గురించి జగన్ మాట్లాడితే విలువలు పాటించే వారు ఆత్మహత్య చేసుకుంటారని సోమిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications