ఇంటర్మీడియట్ పరీక్షలు: మీరే జోక్యం చేసుకోవాలన్న మంత్రి గంటా (ఫోటోలు)
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళంపై ఒక నిర్ణయం వెలువడే విధంగా జోక్యం చేసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్ను కోరారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై ఇంత వరకు రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవటం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని మంత్రి గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఒక వినతి పత్రం ఇచ్చారు. రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరీక్ష నిర్వహించాలని గతంలో గవర్నర్ చేసిన ప్రతిపాదనను తాము అంగీకరిస్తున్నామని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల రాజ్భవన్లో మీ సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ఉమ్మడిగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొన్ని షరతులు పెట్టారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలంటే ఉమ్మడి ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్గా తనను నియమించాలని జగదీశ్రెడ్డి అన్నారు.
మధ్యవర్తిగా మీరు ఒక ప్రతిపాదన చేశారు. జగదీశ్రెడ్డి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కో చైర్మైన్గా ఉండి ఉమ్మడి పరీక్షల నిర్వహణకు స్టీరింగ్ కమిటీ వేసుకోవాలని ప్రతిపాదించారు. మీ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నామని మంత్రి గంటా గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళంపై ఒక నిర్ణయం వెలువడే విధంగా జోక్యం చేసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్ను కోరారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై ఇంత వరకు రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవటం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని మంత్రి గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.

గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఒక వినతి పత్రం ఇచ్చారు. రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరీక్ష నిర్వహించాలని గతంలో గవర్నర్ చేసిన ప్రతిపాదనను తాము అంగీకరిస్తున్నామని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు.

గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ
ఇటీవల రాజ్భవన్లో మీ సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ఉమ్మడిగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొన్ని షరతులు పెట్టారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలంటే ఉమ్మడి ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్గా తనను నియమించాలని జగదీశ్రెడ్డి అన్నారు.

గవర్నర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ
ఇటీవల రాజ్భవన్లో మీ సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ఉమ్మడిగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొన్ని షరతులు పెట్టారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలంటే ఉమ్మడి ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్గా తనను నియమించాలని జగదీశ్రెడ్డి అన్నారు.
గవర్నర్తో భేటీ అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేటికీ స్పందించలేదన్నారు. దీంతో మరోసారి జోక్యం చేసుకుని ఇంటర్ పరీక్షలపై తేల్చాలని గవర్నర్ను కోరామన్నారు. గవర్నర్ రెండు రోజుల పాటు ఢిల్లీ టూర్ వెళుతున్నారని, ఢిల్లీ నుంచి రాగానే మరోసారి రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావుతెలిపారు.












Click it and Unblock the Notifications