గ్రేట్ ఐడియా: ఏ ఘాట్లో ఎంతమందో చూడండి
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి, 27 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల కోసం ఉపయుక్తమైన ఓ వెబ్ సైట్ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఏ ఘాట్ వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు.
http://lsi.iiit.ac.in/godavaripushkaralu/pages/clustermap.html

కోటిలింగాల ఘాట్, లక్ష్మీ గణపతి గాట్, కనకదుర్గ ఘాట్, కృష్ణచౌతన్య ఘాట్, పుష్కర ఘాట్, టిటిడి ఘాట్, పద్మావతి ఘాట్, విశ్వేశ్వర ఘాట్ తదితర ఘాట్ల వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ విషయమై నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు.

రాజమండ్రిలో ఏ ఘాట్ వద్ద ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా ఏపి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెబ్ పేజీని అందుబాటులోకి తెచ్చారు. ఐఐఐటీ విద్యార్థులు దీనిని రూపొందించారు. ఈ లింక్, వీడియో, విశ్లేషణ ద్వారా ఘాట్లోని యాత్రికుల సంఖ్య చెబుతుంది.
Get realtime updates on Pushkaram crowd at Rajamundry ghats using the interactive map launched by AP govt: http://t.co/MwfESuEX0k
— N Chandrababu Naidu (@ncbn) July 15, 2015 దానిని బట్టి భక్తులు ఏ ఘాట్కు వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. ఈ వెబ్ లింగ్ ద్వారా ఏపీలోని మిగిలిన ఘాట్ల సమాచారం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. కోటి లింగాల ఘాట్ వద్ద ఎక్కువ మంది భక్తులు ఉంటున్నారు. ఆ తర్వాత పుష్కర ఘాట్ వద్ద ఉంటున్నారు.












Click it and Unblock the Notifications