పవన్ కళ్యాణ్పై గౌరవం ఉంది, విలువ ఇస్తాం: మంత్రి గంటా
విశాఖపట్నం/ చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తమకు గౌరవం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ అభిప్రాయాలకు ప్రభుత్వం విలువ ఇస్తుందని తెలిపారు.
బాక్సైట్ తవ్వకాలపై 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. డిసెంబర్ 25 నుంచి 27 వరకు విశాఖ, అరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విమ్స్తో సహా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నామని గంటా వెల్లడించారు.

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డులో రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమిషన్ ఇవ్వడాన్ని రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆయన గురువారంనాడు చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో పర్యటించారు.
ఆ తర్వాత మార్కెట్ యార్డులో అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. ఎక్కడా లేని విధంగా మదనపల్లె మార్కెట్ యార్డులో పది శాతం దోపిడీ సాగుతోందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని ఉద్యాన వన పంటల విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాల నుంచి 6.50 లక్షల ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మదనపల్లె మార్కెట్ యార్డును మరింత ఆధునీకరించడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications