కూల్చేయమన్నారు: 'నాగ్' ఎన్ కన్వెన్షన్పై కమిషనర్
హైదరాబాద్/చిత్తూరు: అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని న్యాయస్థానం గతంలో ఆదేశించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ మంగళవారం తెలిపారు. ప్రముఖ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయమై ఆయన స్పందించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే లేదని ఆయన చెప్పారు. అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని కోర్టు తెలిపిందన్నారు. కాగా, ఈ నెల 26, 27 తేదీలలో నగరంలో బోనాలు ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. హలీం బట్టీలో మొదటి, రెండో అంతస్తుల్లో నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్కూళ్లను సీజ్: కలెక్టర్
జిల్లాలో 174 అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 34 పాఠశాలలను మూసివేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా నడుస్తున్న మిగతా పాఠశాలలను కూడా మూసివేస్తామని ఆయన తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లర్ల బహిరంగ విచారణ
ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో నిందితులైన 346 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో బహిరంగ విచారణ జరిగింది. కోర్టు హాలు సరిపోదనే ఉద్దేశంతో పోలీసులు తారకరామ స్టేడియంలో నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.
డిసెంబర్ 15, 2013న తిరుమల శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీ అధికారులు హత్యకు గురయ్యారు. అనంతరం అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు జరిపిన పోలీసులు మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. దాదాపు 446 మందిపై కేసు నమోదు చేయగా 346 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కడప, నెల్లూరు జైళ్లకు తరలించారు. తిరుపతిలో బహిరంగ విచారణ నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications