గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇష్టం లేని పెళ్లి చేశారని కాల్వలో దూకిన యువతి

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని కూడేరు మండలం హంసాయిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. కాల్వలో దూకిన ఆ యువతి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

 A girl allegedly attempted to commit suicide

వాహనం ఢీకొని మహిళ మృతి

అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి-44పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి(44) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

పెనుకొండ మండలం పరమేశ్వపురం నివాసి అయిన లక్ష్మీదేవి కాలినడకన రహదారిపై వెళ్తుండగా వేగంగా వచ్చిన బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వారి నుంచి అరకిలో గంజాయి, రూ. 10వేలు స్వాధీనం చేసుకున్నారు.

భార్యభర్తలను కట్టేసి చోరీ

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోరీ జరిగింది. రవీంద్రనగర్‌లోని ఏడుకొండలు ఇంట్లోకి చొరబడిన కొందరు దొంగలు, ఏడుకొండలు దంపతులను తాళ్లతో కట్టేసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 8తులాల బంగారం, కిలో వెండి, రూ. 50వేల నగదు అపహరించారు.

English summary
A girl allegedly attempted to commit suicide in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X