స్నానంచేస్తుండగా వీడియో తీశారు, బాలిక ఆత్మహత్య
విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పదవ తరగతి విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ సంఘటనలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెట్ సెంటర్ యజమాని, ఒక విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో తీసిన వీడియోతో బెదిరించి ఆ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. చివరికి ఆ బాలిక ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సమాచారం మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలానికి చెందిన బాలిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఒక చిన్నపిల్లవాడి సహాయంతో సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారని సమాచారం.
ఆ పిల్లవాడికి డబ్బులిచ్చి ముగ్గురు యువకులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోతో ఆ బాలికను బెదిరించి ఈ ముగ్గురు నెలరోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. వీరి వేధింపులు తట్టుకోలేక పది రోజుల క్రితం ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications