యువతిపై అత్యాచారం: పసిపిల్లపై డాక్టర్ వికృత చేష్టలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామ సమీపంలో ఓ యువతిపై సోమవారం ఉదయం అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన విక్రమ్ (27) అనే యువకుడు తనపై అత్యాచారం చేశాడని యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశింది.
ఊరి చివరన గేదెలను మేపుతుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం కోసం ఆరేళ్ల చిన్నారితో ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వైద్యం కోసం వచ్చిన చిన్నారితో వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడిని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
అనంతపురం జిల్లాలోనే మరో సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కంభదూర్ మండల కేంద్రంలోని చెరువులో సోమవారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. హత్య చేసి చెరువులసో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
శవం బాగా కుళ్లిపోయి ఉంది. దాంతో నెల రోజుల క్రితమే హత్య జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త్తు చేస్తున్నారు మృతుడు స్థానికుడు కాకపోవచ్చునని అంటున్నారు.