తిరుమలకు వెళ్తున్నారా? వరుస చోరీలు.. మీకు కీలక హెచ్చరిక!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగతనాలు జరుగుతుండడం తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు పెద్ద తలనొప్పిగా మారింది.
తిరుమలలో మహిళా భక్తులే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఇటీవల కాలంలో వరుసగా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుంటున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం తిరుమలలో మహిళా భక్తులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఆరుగురు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ
రెండు వారాల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ లోని ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో ఓ దొంగ రెండు లక్షలకు పైగా సొమ్మును కాజేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో టిటిడి అధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తుచేసి నిందితుడిని గుర్తించారు. గతంలో తిరుమలలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తినే మళ్లీ తిరుమలలో దొంగతనం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.
కారు అద్దాలు పగలగొట్టి చోరీ
ఇక ప్రస్తుతం ఈ దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి మరీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే తిరుమల ఆలయం వెండివాకిలి వద్ద కూడా మహిళా భక్తుల లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసులు నానా చావు చావాల్సి వచ్చింది. కాగా నిన్న తిరుమలలో కారు అద్దాలు పగలగొట్టి కారు లోపల బంగారం చోరీ చేయడం కూడా తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది.
కారు అద్దాలు పగలగొట్టి బంగారం చోరీ
భక్తులు స్వామి దర్శనానికి వెళుతూ కారులోనే సెల్ ఫోన్లు, కొన్ని విలువైన వస్తువులు, బంగారం పెట్టి వెళ్ళారు. శ్రీవారి దర్శనం తర్వాత వచ్చి చూసిన వారికి కారు అద్దాలు పగిలి ఉన్నాయి. లోపల సుమారు 40 గ్రాముల బంగారాన్ని, విలువైన వస్తువులను దోచుకు వెళ్లినట్టు గుర్తించిన సదరు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తిరుమలలో దొంగల బెడద... దొంగల కోసం పోలీసుల తిప్పలు
ఇదే క్రమంలో పోలీసులు తిరుమలకు వచ్చే వారు తమ ఆభరణాలు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత వరకు సింపుల్ గానే రావడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మరోవైపు దొంగలను పట్టుకొని, తిరుమలకు వచ్చే వారికి భరోసా కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడడానికి పోలీసులు, టిటిడి అధికారులు తెగ కష్టపడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications