సీఐఐ సదస్సు.. చంద్రబాబు ఇలాకాలో బంగారం శుద్ది చేసే ఫ్యాక్టరీ
రూ.300కోట్ల కోట్లతో బంగారం కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సీఈవో హనుమప్రసాద్ వెల్లడించారు.
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకాలో బంగారం శుద్ది చేసే కర్మాగారం ఏర్పాటు కాబోతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్ట్రేలియన్ ఇండియా రిసోర్స్ కంపెనీ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతుంది.
కంపెనీ సీఈఓ హనుమప్రసాద్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తెలిపారు. రూ.300కోట్ల కోట్లతో బంగారం కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు హాజరైన హనుమప్రసాద్.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
గతేడాది విశాఖలో జరిగిన ఇదే సీఐఐ సదస్సులో.. కర్నూలులో రూ.300కోట్లతో ఇలాంటి ప్రాజెక్టుకే ప్రభుత్వంతో ఎంఓయూ కుదర్చుకున్నామని తెలిపారు. మరో రెండు నెలల్లో దానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని అన్నారు.
English summary
Australian india resources company going to establish their Gold cleaning factory in CM Chandrababu Naidus hometown Kuppam