కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ - చెన్నై కేశినేని ట్రావెల్స్ బస్సులో బంగారం అదృశ్యం అయింది. బస్సులో మహేష్, సెంథిల్ అనే ఇద్దరు వ్యాపారులు రెండు సంచుల్లో ఏడు కిలోల చొప్పున.. మొత్తం పద్నాలుగు కిలోల బంగారాన్ని తీసుకు వెళ్తున్నారు.
అయితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి వద్ద చూసుకునే సరికి అందులో ఓ సంచి లేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచిలో ఉన్న ఏడుకిలోల బంగారం అదృశ్యం కావడం ఆశ్చర్యపరిచింది.
బంగారం కోసం తొలుత బస్సు అంతా వెదికారు. అయినప్పటికీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత భారీస్థాయిలో బంగారం తరలించేటప్పుడు జాగ్రత్తలు లేకుంట ఎలా అని పోలీసులు బాధితులను ప్రశ్నించారు. చెన్నైలోని నగల దుకాణంలో వారు పని చేస్తున్నారని తెలుస్తోంది.

లైంగిక వేధింపులకు నిరసనగా ధర్నా
చిత్తూరు జిల్లాలోని సీటీవో లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ శాఖ ఉద్యోగులు వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
విశాఖలో గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో రెండు టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications