కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ - చెన్నై కేశినేని ట్రావెల్స్ బస్సులో బంగారం అదృశ్యం అయింది. బస్సులో మహేష్, సెంథిల్ అనే ఇద్దరు వ్యాపారులు రెండు సంచుల్లో ఏడు కిలోల చొప్పున.. మొత్తం పద్నాలుగు కిలోల బంగారాన్ని తీసుకు వెళ్తున్నారు.
అయితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి వద్ద చూసుకునే సరికి అందులో ఓ సంచి లేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచిలో ఉన్న ఏడుకిలోల బంగారం అదృశ్యం కావడం ఆశ్చర్యపరిచింది.
బంగారం కోసం తొలుత బస్సు అంతా వెదికారు. అయినప్పటికీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత భారీస్థాయిలో బంగారం తరలించేటప్పుడు జాగ్రత్తలు లేకుంట ఎలా అని పోలీసులు బాధితులను ప్రశ్నించారు. చెన్నైలోని నగల దుకాణంలో వారు పని చేస్తున్నారని తెలుస్తోంది.

లైంగిక వేధింపులకు నిరసనగా ధర్నా
చిత్తూరు జిల్లాలోని సీటీవో లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ శాఖ ఉద్యోగులు వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
విశాఖలో గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో రెండు టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications