Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్షేమం , సమానత్వం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు : గవర్నర్..!!

ఏప ప్రభుత్వం సంక్షేమం - సమానత్వం లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తుందని గవర్నర్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరి మద్దతు అవసరం అని ఆకాంక్షించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్ల కాలంలో సాధించిన పురోగతి..అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ఇచ్చిన హామీల అమలు: గవర్నర్ నజీర్ అహ్మద్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను విశ్లేషించారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించిందని చెప్పారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని ప్రశంసించారు.

Governor Abdul Nazeer explains Govt Success in implementing Welfare and Development in Assembly speech

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది పేదల ప్రభుత్వమన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశారని చెప్పిన గవర్నర్..ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నారని వివరించారు.

సంక్షేమానికి ప్రాధాన్యత: విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధులను గుర్తించి రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నారన్నారు. 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు.

ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. నాడు - నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు.

భవిష్యత్ పై భరోసా: ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించారని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని గవర్నర్ వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ ప్రభుత్వం నిలబెట్టుకొనేందుకు పని చేసిందని వివరించారు. రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేసారని చెప్పారు.

వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా 78.84 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. సముద్ర తీర ప్రాంతంలో ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. ఉద్దానంలో రక్షిత మంచినీటి సరఫరా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు ప్రశంసనీయమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+