Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివేకా హత్య కేసు పై సవాంగ్ : సీఎం జగన్ ఏం చెప్పారంటే : రెండు ఫ్యామిలీలు..రెండు కళ్లు..!!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో భాగంగా పలువురు ఇచ్చిన స్టేట్ మెంట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శల పైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత డీజీపీగా సవాంగ్ నియమితులయ్యారు.

జగన్ తనతో ఏం చెప్పారంటే

జగన్ తనతో ఏం చెప్పారంటే

ఈ కేసు విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారంటూ సునీత భర్త రాజశేఖర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు మరింత చర్చకు కారణమయ్యాయి. దీంతో...దీని పైన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్ ఏం చెప్పేవారనే దాని పైన ఆయన స్పందించారు. హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. వైఎస్‌ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సీఎం తనకు చెప్పారని అందులో వివరించారు.

అదే విషయాన్ని సునీత భర్తతోనూ చెప్పాను

అదే విషయాన్ని సునీత భర్తతోనూ చెప్పాను

సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్‌ స్పష్టం చేసారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ వచ్చిన వార్తల పైన వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపైన ఉందని పేర్కొన్నారు. సునీత భర్త రాజశేఖర రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లో చెప్పిన అంశాలు మీడియాలో వచ్చాయి. వీటి ఆధారంగా ప్రతిపక్ష టీడీపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసింది.

రాజకీయంగా విమర్శలకు కేంద్రంగా

రాజకీయంగా విమర్శలకు కేంద్రంగా

దీని పైన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సైతం రియాక్ట్ అయ్యారు. సునీత కుటుంబ సభ్యులు చంద్రబాబు చేతిలో పావులుగా మారారా అనే అనుమానం వ్యక్తం చేసారు. అసలు సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న కొన్ని అంశాలు అంతు చిక్కనవిగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ కు సీబీఐ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇటు సీబీఐ తమ విచారణ సమయంలో సేకరించిన సమాచారం.. వ్యక్తుల నుంచి రాబట్టిన స్టేట్ మెంట్స్ ను కోర్టుకు సమర్పించింది. దీంతో..సీబీఐ రానున్న రోజుల్లో వేయనున్న అడుగులు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+