పెళ్లికి ముందే టెక్కీ వరుడు పరార్, చితకబాదిన వైనం

ఈ సమయంలో అనూహ్యంగా వరుని అదృశ్యంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. చివరకు పెండ్లి కుమారుడు రాలేడని నిర్ధారించుకున్న వధువు బంధువులు వరుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పని చేస్తున్నానంటూ రామకృష్ణపురంకు చెందిన విజయ్ రెడ్డి గజ్వేల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమార్తెతో నెల క్రితం వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అయితే కట్నకానుకల క్రింద రూ.20లక్షలు ఇవ్వడానికి వధువు కుటుంబ సభ్యులు అంగీకరించి అప్పుడే రూ.7.50లక్షలు అప్పజెప్పారు.
ఈ క్రమంలో డిసెంబర్ 19న ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఈ నెల 9న వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కట్నం డబ్బుల, బంగారు వస్తువుల కోసం మొదటగా వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, ఇతర బంధువులు గజ్వేల్ చేరుకున్నారు.
పెళ్లి సమయం దగ్గర పడుతున్నప్పటికీ వరుడు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు వారిని నిలదీయడంతో అడ్డదిడ్డంగా సమాధానం ఇచ్చారు. వారు సైతం పరారవడానికి సిద్ధమవుతున్న తరుణంలో పెండ్లివారు పట్టుకొని చితకబాదడంతోపాటు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బాధితులు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications