ఎన్నికల వేళ- ఏపీలో..!!
GST March 2024 collections: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. మార్చిలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 11.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
మార్చిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1.78 లక్షల కోట్ల రూపాయలు. 2024లో ఇదే మార్చి నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య 11.5 శాతం అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకంది.

ఇందులో సీజీఎస్టీ వాటా 34,532 కోట్లు, ఎస్జీఎస్టీ- 43,746 కోట్లు, ఐజీఎస్టీ- 87,947 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 40,322 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 12,259 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 996 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.
ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల ఏకంగా 16 శాతంగా నమోదైంది. అంటే గత ఏడాది మార్చిలో ఏపీలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,532 కోట్ల రూపాయలు.. కాగా ఇప్పుడు ఈ సంఖ్య 4,000 కోట్ల రూపాయలను అధిగమించింది. 4,082 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 12 శాతం.
రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.601 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.852 కోట్లు, పంజాబ్-రూ.2,090 కోట్లు, చండీగఢ్-రూ.238 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,730 కోట్లు, హర్యానా-రూ.9,545 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-రూ.5,820 కోట్లు, రాజస్థాన్-4,798 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
ఉత్తర ప్రదేశ్-రూ.9,087 కోట్లు, బిహార్-రూ.1,991 కోట్లు, సిక్కిం-రూ.303 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.168 కోట్లు, నాగాలాండ్-రూ.83 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. మణిపూర్-రూ.69 కోట్లు, మిజోరం-రూ.50 కోట్లు, త్రిపుర-రూ.121 కోట్లు, మేఘాలయ-రూ.213 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లను అందుకున్నాయి.
అస్సాం-రూ.1,543 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.5,473 కోట్లు, జార్ఖండ్-రూ.3,243 కోట్లు, ఒడిశా-5,109 కోట్లుగా రికార్డయ్యాయి. ఛత్తీస్గఢ్- 3,143, మధ్యప్రదేశ్-రూ.3,974 కోట్లు, డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.452 కోట్లు, గుజరాత్-11,392 కోట్లు రికార్డయ్యాయి.
మహారాష్ట్ర-రూ.27,688 కోట్లు, కర్ణాటక-రూ.13,014 కోట్లు, గోవా-రూ.565 కోట్లు, కేరళ-రూ.2,598 కోట్లు, తెలంగాణ- రూ.5,399 కోట్లు, తమిళనాడు-రూ.11,017 కోట్లు, పుదుచ్చేరి-రూ.221 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.32 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications