కరెన్సీ రద్దు: వెళ్లి కష్టాలు తెలుసుకున్న ఎంపీ గల్లా జయదేవ్, 'సిద్ధార్థ'కు దుర్గగుడి భూమి
విజయవాడ/గుంటూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలు తెలుసుకునేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో పర్యటించారు. గుంటూరులోని ఓ రైతు బజార్, సీఎం నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం అడిగారు.
బ్యాంకులలోకి వెళ్లి ఖాతాదారులతో మాట్లాడారు. ప్రజల చెప్పిన వాటిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని చెప్పారు. నోట్లు రద్దు చేసిన తొలి రెండు మూడు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని చెప్పారు. ఓ మంచి పని కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో కరెన్సీ అందుబాటులోకి తేవాలన్నారు.

ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు భేటీ జరిగింది. పెద్ద నోట్ల రద్దు తదితర కీలక అంశాల పైన వారు చర్చించారు. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావులు వెల్లడించారు.
విశాఖ ఉడా పరిధిలో పూలింగ్ స్కీంకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుర్గగుడికి చెందిన 14.2 ఎకరాలను సిద్ధార్థ కాలేజీకి కేటాయించడం. ఎకరాకు రూ.లక్షన్నర చొప్పున కేటాయింపు. మూడేళ్ల కోసారి ఐదు శాతం లీజు పెంచాలని నిర్ణయించారు.
రూ.300 కోట్లతో సెట్టాప్ బాక్సులు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధిలో అమృతా విశ్వవిద్యాలయానికి 200 ఎకరాల కేటాయింపు. ఆర్బీఐకి 16 ఎకరాలు, సీపీడబ్బ్యూకు 28 ఎకరాలు కేటాయింపు.
పల్స్ సర్వే నెలాఖరుకు పూర్తి చేయడం, సర్వేల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications