వైఎస్ జగన్తో భేటీపై మోడీ రియాక్షన్..!
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధ్యమైనంత సహకారం అందిస్తామని చెప్పారు. వైఎస్ జగన్కు తన అండగా ఎప్పుడూ ఉంటుదందని అన్నారు.
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం దేశ రాజధానిలో నరేంద్ర మోడీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 40 నిమిషాల పాటు ప్రధానితో సమావేశం అయ్యారు వైఎస్ జగన్. ప్రత్యేకించి- రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.
Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6
— Narendra Modi (@narendramodi) May 26, 2019
లోటు బడ్జెట్ మొదలుకుని రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, విభజన చట్టంలో పొందు పరిచిన అంశాలను వైఎస్ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించారు. దనికి సంబంధించిన ఓ నోట్ను అందజేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానిని కోరారు.
దీనికి మోడీ స్పందించారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఐఐటీ వంటి కొన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి మంజూరు చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరిస్తామని అన్నారు. అనంతరం ఈ విషయాన్ని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. pic.twitter.com/g6mvRW3Me4
— Narendra Modi (@narendramodi) May 26, 2019
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యామని, ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలప్రదమైన చర్చలు నిర్వహించామని మోడీ అన్నారు. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తామని వైఎస్ జగన్కు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
వైఎస్ జగన్ ఈ ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, లోక్సభకు ఎన్నికైన మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, నందిగాం సురేష్, వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.