వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా కాళ్ల వద్ద బేరానికి: విభజనపై హరి లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nandamuri Harikrishna
హైదరాబాద్: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోనియా గాంధీ కాళ్ల దగ్గర బేరానికి పెట్టారని తెలుగదేశం పార్టీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర నాయకులు తెలుగుజాతి వృక్షానికి పుట్టిన కుక్క మూతి పిందెలని ఆయన అన్నారు.

తెలుగుతల్లి ముక్క చెక్కలైందని, అధికార ప్రాపకం కోసం రాజకీయ వ్యభిచారులు తెలుగుతల్లికి గర్భశోకం కలిగించారని ఆయన అన్నారు. చీలిన తెలుగుజాతిని చూసి తారకరాముని ఆత్మ ఘోషిస్తోందని ఆయన అన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు తలా పాపం, తలా పిడికెడు అన్నట్లు వ్యవహరించాయని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఒక్కో జిల్లాను ఒక్కో రాష్ట్రంగా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజనలో నాయకులు వికృత స్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. తెలుగుతల్లిని నిలువునా చీల్చారని, ఇలాంటి నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హరికృష్ణ అన్నారు. ఈ నేతలా తెలుగుతల్లి బిడ్డలు అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఉత్తర ప్రగల్భాలు పలికారని ఆయన అన్నారు.

రాజకీయం ఇంత నీచంగా ఉంటుందా అని ఆయన ఆశ్చర్యపోయారు. సొంత పార్టీపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాస్త్రీయ విభజన జరగాలంటే ప్రతి గ్రామంలో బ్యాలెట్ నిర్వహించాల్సి ఉండిందని ఆయన అన్నారు. అధికారం కోసం స్వార్థంతో వ్యవహరించిన నేతలు తప్పకుండా రాజకీయ వ్యభిచారులేనని ఆయన అన్నారు.

English summary
Telugudesam ex MP and NT Rama Rao's son Nandamuri Harikrishna blamed political system for the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X