వేధించొద్దు, ముద్రగడని జైల్లో పెట్టండి: హర్ష, ఏపీని కేంద్రం ఆదుకోవాలి: కోడెల
అమలాపురం/విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం తీవ్రంగా బాధిస్తోందని, ఆయనను బాధపెట్టేకన్నా అరెస్టు చేసి జల్లో పెట్టించినా బాగుండేదని ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కుల కోసమే ముద్రగడ ఉద్యమిస్తున్నారన్నారు.
ముద్రగడ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ఆంక్షలు పెడుతోందన్నారు. ముద్రగడ పరిస్థితి జైల్లో కన్నా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు ఓ డిక్టేటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారన్నారు.

చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తుని విధ్వంసం ఘటనలో అమాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. కాపులు, దళితులను అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు. తుని దగ్ధం కేసులో ఓ దళితుడిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. దీంతో, సీఐడీ విచారణలో డొల్లదనం బయటపడుతోందన్నారు.
కేంద్రం ఆదుకోవాలి: కోడెల
విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు కోరారు. కేంద్రంలో టిడిపి మిత్రపక్షంలో ఉన్నందున రాష్ట్రాన్ని అదుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications