జగన్ కేబినెట్ మంత్రిపై సీబీఐ దర్యాప్తు- పిటిషన్ అనుమతించిన హైకోర్టు
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం చిక్కుల్లో పడ్డారు. ఆయన సొంత నియోజకవర్గమైన కర్నూలులోని ఆలూరులో పేకాట మాఫియాతో ఆయనకు ఉన్న లింకులు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పలుమార్లు చెప్పినా, దీనిపై వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని మంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామం గుమ్మనూరులో పోలీసులు 33 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారు పోలీసులపై కారంపొడి చల్లుతూ ఎదురుదాడికి దిగారు. చివరికి ఎలాగోలా పరిస్ధితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు 40 వాహనాలతో పాటు 5.44 లక్షల రూపాయల నగదు కూడా సీజ్ చేశారు. వీరంతా మంత్రి అనుచరులు కావడం వల్లే పోలీసులపై దాడికి తెగబ్డడారనే ఆరోపణలు వచ్చాయి.

తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి జయరాం అప్పట్లో ఖండించినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. గుమ్మనూరులో పేకాట మాఫియాతో మంత్రికి ఉన్న లింకులపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. రాష్ట్రమంత్రికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు కోరడంతో ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు అనుమతించడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు.. వైరల్ వీడియో -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications