పవన్ కల్యాణ్ కి ఏమైంది? ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏంటి?.. బ్రేక్ తీసుకోవాలంటున్న ఫ్యాన్స్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, తెలుగు రాష్ట్రాలు అభిమానంగా, ప్రేమతో పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఏమైంది..? సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయనకు కోట్ల మంది అభిమానులు. ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తలపండిన నాయకులను తట్టుకుని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరోగ్యంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగునా అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆరోగ్యం విషయం లో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నది చర్చగా ఉంది.
ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఉదయం పదకొండు గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం పదిన్నరకే చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా మీటింగ్ లో పాల్గొనాలని వచ్చారు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునే సరికే జ్వరం అధికం అయినట్లు సమాచారం.
దీంతో ఆయన తన క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడం కోసం కూడా ఆయన వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయినట్లు సన్నిహిత వర్గాల టాక్. దీంతో పవన్ కి ఏమైంది అన్న చర్చ అందరిలోనూ బలంగా వినిపిస్తోంది. పవన్ కు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఇదే విషయంపై పవన్ అభిమానులు, జన సైనికులు మరింత ఆందోళన చెందుతున్నారు. పవన్ కు తరచూ జ్వరం వస్తోందని అంటున్నారు. ఇక ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉందని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ చాలా కాలంగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్ కు ఈ సమస్య ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా ప్రజల్లో పర్యటించినప్పుడూ ఒక్కోసారి ఈ సమస్యతోనే అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఓ వైపు తీరిక లేకుండా ప్రజా సమస్యలు, మరోవైపు సినిమాలు కారణంగా పవన్ తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
అయితే పవన్ తన హెల్త్ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. పవన్ ఇపుడు చాలా కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. ఓవైపు సినిమాలు.. అలాగే రాజకీయంగా ఆయన ఇపుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో ఉన్నారు. జనసేన పార్టీకి ఆయన సర్వస్వం. దీంతో ఆయన ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఉన్నది స్పాండిలైటిస్ సమస్యే అయితే దానికి బెస్ట్ మెడిసిన్ విదేశాల్లో ఉందని.. కొన్నాళ్లపాటు అన్నింటికీ బ్రేక్ ఇచ్చి ఆరోగ్యం చూసుకోవాలని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం బారిన పడటం ఆయన్ను మరింత కలిచివేసింది. కుమారుడి ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన పవన్ సింగపూర్ చేరుకున్నారు. చికిత్స అనంతరం సతీమణి అన్నా లెజినోవాతో కలిసి మార్క్ శంకర్ ను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. అనంతరం మార్క్ శంకర్ కోసం పవన్ సతీమణి అన్నా కొణిదెల తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. మార్క్ శంకర్ పేరిట ఒక్కపూట అన్నదానం కోసం రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications