వర్షాలతో తల్లడిల్లిన గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వరుణుడు తన ప్రతాపం చూపించాడు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలు నీటమునిగాయి. రహదారులు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది. ప్రకాశం, కర్నూలులో పొంగిన వాగులు నల్లమల అటవీప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications