స్వయంగా వస్తానన్న బాబు: 12ఏళ్ల తర్వాత కుప్పంలో అంత భారీ వర్షం..
తన సొంత నియోజకవర్గం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
చిత్తూరు: దాదాపు 12ఏళ్ల తర్వాత చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ వర్షాలు కురిశాయి. తన సొంత నియోజకవర్గం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
భారీ వర్షాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మత్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు వృధా కాకుండా అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

వీలైతే ఈ నెల 14, 15 తేదీల్లో కుప్పం పర్యటనకు స్వయంగా వస్తానని చెప్పారు. కాగా, ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కుప్పం వీధులన్ని జలమయం అయ్యాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కుండపోత వర్షానికి చిత్తూరు జిల్లాలోని చెరువులన్ని నిండిపోయాయి.
More From
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications