బాబు, జగన్ల బాధ్యత: రాజమండ్రి ఘోర ప్రమాదంపై శివాజీ ఆవేదన
హైదరాబాద్: తూర్పు గోదావరిలోని మోరంపూడి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూలు బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన పైన ప్రముఖ నటుడు, భారతీయ జనతా పార్టీ నేత శివాజీ మండిపడ్డారు. ఫిట్ నెస్లేని బస్సుకు అనుమతి ఎలా ఇచ్చారని, వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
రాజకీయాలను భ్రష్టు పట్టించే వారు ఎప్పుడు పోతారోనని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఏం సాధించి పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలన్నారు.

దీక్షకు జనాన్ని తరలిస్తున్నందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు. కోర్టు ఒక నోటీసు ఇస్తే పరుగెత్తుకెళ్తారని, వ్యవస్థలో ఆ స్థాయి భయం రావాలన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లు కచ్చితంగా నిర్వర్తిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవన్నారు.
కాగా, రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ స్కూల్ బస్సు ఢీకొని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. తణుకులో జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా కార్యకర్తలు నారాయణ స్కూల్ బస్సులో వెళుతున్నారు.
అతివేగంగా వచ్చిన బస్సు మోరంపూడి జంక్షన్ వద్ద ఎదురుగా వచ్చిన కారును, బైక్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రోడ్డు పక్కన నడుస్తున్న మరో ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications