జగన్ ప్రతినిధిగా విజయసాయి: హెటిరో, ‘ఈడీ కేసులో మినహాయింపు కోరిన జగన్’
హైదరాబాద్: జడ్చర్ల సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)లో 75 ఎకరాలను కేటాయించాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పెట్టుబడుల గురించి కలిశారని హెటిరో గ్రూపు డైరెక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చారు.
1998 నుంచి వైయస్ రాజశేఖర్రెడ్డి తెలుసని, 2006లో జడ్చర్ల సెజ్లో ఎకరాకు రూ.7 లక్షల చొప్పున 35 ఏళ్లకు లీజుగా 75 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. జగన్ తరఫున తాను వచ్చానని సాయిరెడ్డి చెప్పారని, పెట్టుబడులు ఎందుకు పెట్టాలన్నదానిపై వివరించారని తెలిపారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందో, ట్రైడెంట్ లైఫ్సైన్సెస్లపై సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.. నిందితుల వాంగ్మూలాలు సేకరించింది. పెట్టుబడుల వ్యవహారాలన్నీ సాయిరెడ్డి చూస్తుంటారని జగన్ వాంగ్మూలంలో తెలిపారు.
తన సలహాతోనే సోదరుడు ప్రసాద్రెడ్డి, భార్య కె రాజేశ్వరి, అల్లుడు పి శరత్చంద్రారెడ్డి (ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ)లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు అరబిందో ఫార్మా డైరెక్టర్ నిత్యానందరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందోకు కేటాయించిన భూమిని ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు బదలాయించడంపై ఈడీ వివరాలు రాబట్టింది.

హాజరు మినహాయింపు కోరిన జగన్
జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా నిందితులు ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం తొలిసారి హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫార్మా కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ విచారణ కొనసాగుతోంది.
కాగా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున హాజరు మినహాయింపు కోరుతూ ప్రధాన నిందితుడైన జగన్మోహన్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం నిందితులు 19 మంది ఉండగా అందులో జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాల తరఫునా జగన్ హాజరు కావాల్సి ఉంది. హాజరైన వారిలో వి.విజయసాయిరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి (హెటిరో డైరెక్టర్), కె.నిత్యానందరెడ్డి (అరబిందో ఎండీ) తదితరులున్నారు.
నిందితుల హాజరును నమోదు చేసుకున్న జడ్జి టి రజని తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా అరబిందో, హెటిరో గ్రూపులు జగన్ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాల్లో రూ.29.50 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ చేసిన ఫిర్యాదుపై ఈ విచారణ కొనసాగుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications