చంద్రబాబుకు ఫిరాయింపు ఝలక్: అఖిలప్రియ సహా నలుగురికి హైకోర్టు షాక్
తెలుగుదేశం పార్టీకి షాక్. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట.వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరి, మంత్రి పదవులు పొందిన వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీకి షాక్. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట. వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరి, మంత్రి పదవులు పొందిన వారికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఫిరాయింపుతో పదవులు
2014 ఎన్నికల్లో వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత అధికార పార్టీలో చేరి, మంత్రులు అయ్యారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ ఫిరాయించి ఉన్నత పదవులు పొందడం సరికాదని పేర్కొన్నారు.

నలుగురికి నోటీసులు
దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం వైసిపి నుంచి గెలిచి, టిడిపిలో మంత్రులు అయిన నలుగురికి నోటీసులు పంపించింది.
Recommended Video


ఫిరాయించింది వీరే..
మంత్రులు భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు న్యాయస్థానం నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆందులో ఆదేశాలు జారీ చేసింది.

జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి పిటిషన్.. తలసానిపై..
పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమని ప్రముఖ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిరాయింపు అంశాన్ని కూడా దీంతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!











Click it and Unblock the Notifications