ఆయేషా హత్య: సత్యంబాబు నిర్దోషి, హైకోర్టు సంచలన తీర్పు, పోలీసులపై ఆగ్రహం
ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు శుక్రవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడిగా చెబుతున్న సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్లుగా సత్యంబాబును జైలులో ఉంచారని పోలీసులను
విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు శుక్రవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడిగా చెబుతున్న సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్లుగా సత్యంబాబును జైలులో ఉంచారని పోలీసులను హైకోర్టు మందలించింది.
సత్యంబాబుకు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఆయేషా మీరా హత్య కేసు 2007లో చోటు చేసుకుంది. ఆమె గదిలోకి చొరబడి అత్యాచారం చేసి, హత్య చేశాడని సత్యం బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఓ సమయంలో సత్యంబాబు నడవలేని పరిస్థితి కూడా కనిపించింది.
అయితే, ఆ హత్యను ఓ రాజకీయ నాయకుడి బంధువు చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి. సత్యంబాబు పైన ఆ అత్యాచారం, హత్యను మోపినట్లుగా కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications