చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టులో షాక్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు(బోండా ఉమ)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బోండా దంపతులతోపాటు మరో 9మందపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని ఎమ్మెల్యే బోండా ఉమ కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమ కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరరావు నగర కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే ఉమ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయినా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడంతో కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.
Recommended Video
ఈ క్రమంలో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులతోపాటు 9మందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది.